సీపీఐ(ఎం) అభ్యర్ధి అర్జున్ రావు విజయాన్ని కాంక్షిస్తూ భారీ ర్యాలీ…

– 150 వాహనాలు,150 కి.మి..
– రెపరెపలాడిన ఎర్రజెండా…
– హాజరైన జిల్లా కార్యదర్శి కనకయ్య…
నవతెలంగాణ – అశ్వారావుపేట : ప్రజా సంఘాలు బలపరిచిన సీపీఐ(ఎం) అభ్యర్ధి అర్జున్ రావు పిట్టల విజయాన్ని కాంక్షిస్తూ నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట మండలంలో 150 ద్విచక్ర వాహనాలతో,150 కి.మీ పొడవునా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య ప్రారంభించారు. వినాయకపురం లో ప్రారంభం అయిన ర్యాలీ కొత్త మామిళ్ళ వారిగూడెం, తిరుమలకుంట, ఆసుపాక, నందిపాడు, వడ్డెరంగాపురం, గుమ్మడవల్లి, బచ్చువారిగూడెం, నారాయణపురం, దబ్బతోగు, మల్లాయిగూడెం, పండువారిగూడెం, రామన్నగూడెం, వాగొడ్డుగూడెం, వేదాంతపురం, నల్లబాడు, ఊట్లపల్లి, అశ్వారావుపేట పట్టణంలో కలియ తిరిగింది. ఈ ర్యాలీ లో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు స్వయంగా ద్విచక్రవాహనం నడిపారు. ఈ కార్యక్రమంలో అభ్యర్ధి అర్జున్ తో పాటు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య,లిక్కి బాలరాజు,జిల్లా కమిటీ సభ్యులు బి.చిరంజీవి ఓపెన్ టాప్ వాహనంలో పాల్గొన్నారు.
Spread the love