స్తంభానికి బైకు ఢీకొని వ్యక్తి మృతి

నవతెలంగాణ – ఆత్మకూరు
ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రి నందు వ్యక్తి మృతి చెందిన సంఘటన బయటపడింది. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం చిన్న చింతకుంట మండలం గూడూరు గ్రామానికి చెందిన ఆంజనేయులు (35) ఉపాధి నిమిత్తం గద్వాల జిల్లా అనంతపురం గ్రామంలో కూలీ చేస్తూ జీవనం గడిపే వాడనీ అయితే బంధువులు గూడూరులో చనిపోవటం వల్ల అంత్యక్రియల నిమిత్తం వచ్చి తిరిగిపోవు సందర్భంలో అమరచింత మండల పరిధిలోని మస్తిపురం, చంద్రగడ్‌ మధ్యలో దారి పక్కన గల విద్యుత్తు స్తంభానికి బైక్‌ ఢీకొని బైక్‌ నడుపుతున్న అంజనేయులు తీవ్రంగా గాయపడి అక్కడే పడడంతో వెనక ఉన్న వారి బంధువు బిసన్న సమీప బంధువులకు ఫోన్‌ చేయడంతో వెంబడే ప్రమాద స్థలానికి చేరుకొన్న వారి బంధువులు గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆంజనేయులు మతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. మతుడికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నట్లు తెలిపారు. మతుడి బంధువులు బిసన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సురేష్‌ పేర్కొన్నారు.

Spread the love