ద్విచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తి మృతి

నవతెలంగాణ-గోవిందరావుపేట : మండలంలోని మోట గూడెం గ్రామానికి చెందిన కురుసం తరుణ్ తన ద్విచక్ర వాహనంపై పసర వచ్చి తిరిగి వెళుతున్న గ్రామంలో వాహనం అదుపుతప్పి జరిగిన ప్రమాదంలో గాయపడి మృతి చెందినట్లు పసర ఎస్ ఐ , ఎస్ కే ఎస్.కె మస్తాన్ తెలిపారు. ఎస్ ఐ మస్తాన్ కథనం ప్రకారం మొట్లాగూడెం గ్రామానికి చెందిన కురసం తరుణ్  14.10.2023 రోజు బైక్ మీద పసర కి వచ్చి తిరుగు ప్రయాణం లో తప్పమంచ దాటినా తర్వాత బైక్ అదుపు తప్పి క్రింద పడగ తలకు బలమైన గాయం కావటం తో ములుగు  ఏరియా హాస్పిటల్ కి తరలించగా అక్కడ డాక్టర్స్ సలహాతో మెరుగైన చికిత్స కొరకు ఎంజీఎంహెచ్ వరంగల్ లో చేర్చగా చికిత్స పొందుతూ 15.10.2023 సాయంత్రం 06.30 కి మరణించాడు. సంఘటన స్థలాన్ని సి ఐ శంకర్ తో కలిసి సర్పంచ్ సనప సమ్మయ్య తో పాటు ఎస్సై మస్తాన్ పరిశీలించారు. స్థానికులను ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుడి తల్లి కురసం సాంబలక్ష్మి ఫిర్యాదు మేరకు  కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించనైనదన్నారు.
Spread the love