అక్రమ పట్టాలు రద్దు చేయాలని వినతి 

నవతెలంగాణ కమ్మర్ పల్లి: మండలంలోని అమీర్ నగర్ గ్రామ పరిధిలో గల సర్వేనెంబర్ 73లో అక్రమ పట్టాలను రద్దు చేయాలని కోరుతూ అమీర్ నగర్ గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు సోమవారం తహసిల్దార్ ఆంజనేయులకు వినతిపత్రం అందజేశారు. గ్రామ పరిధిలోని పోరంబోకు భూమి సర్వే నంబర్ 73లో చౌట్ పల్లి గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు అక్రమంగా పట్టాలు చేయించుకున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ విషయమే గతంలో రెండు మూడు సార్లు వినతి పత్రాలు కూడా అందజేసినట్లు తెలిపారు. ప్రస్తుతం అట్టి భూమిలో విద్యుత్ స్తంభాలు వేసే పని జరుగుతుందని, కావున వారిపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రం అందించారు. సర్వే నిర్వహించి అక్రమ పట్టాలను రద్దు చేయాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love