ఆస్తి కోసం తండ్రిని చంపిన తనయుడు..

నవతెలంగాణ – జుక్కల్

ఆస్తికోసం కన్న తండ్రిని కడతేర్చిన సంఘటన జుక్కల్ మండలంలోని సోపూర్ గ్రామములో ఆదివారం  నాడు చోటుచేసుకుంది. జుక్కల్  ఎస్సై సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. సోపూర్ గ్రామానికి చెందిన లాలప్పా (75) సం” ఆస్తి పంపకాలలో నిత్యం కొడుకు సుభాష్ తండ్రితో గొడవ పడేవాడని,  ఆస్తిని తనపేరుమీద కాకుండా తన భార్య పేరుమీద చేశాడనే కోపంతో కొడుకు తండ్రిని హత్య చేశాడని  గ్రామస్తులు, పోలీసులు  తెలిపారు. పోలీసులు సంఘటన స్ఖలాన్ని పరీశీలించి  కేసు నమేాదు చేసి  విచారణ ఛేపడుతున్నామని అన్నారు.
Spread the love