జుక్కల్ బస్టాండ్ లో వ్యక్తి మృతి

నవతెలంగాణ – జుక్కల్
మండల కేంద్రంలోని ప్రయాణ ప్రాంగణంలో  వ్యక్తి  మృత దేహం ఉందని జుక్కల్ ఎస్సై సత్యనారాయణ తెలిపారు. ఈ సంధర్భంగా ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం మండలకేంద్రానికి  చెందిన సాలే యాదు వయస్సు  సుమారుగా  నలుపై ఐదు ఉందని,  గత కొంతకాలంగా  అనారోగ్యంతో అంతుపట్టని వ్యాదితో  సమస్యలు  ఎదురు కొంటున్నాడు, సమస్య తీవ్రతరంగా ఉందని తెలిసిన జులాయిగా తిరిగేవాడను తెలిసింది.  శనివారం ఉదయం జుక్కల్  బస్టాండ్ వద్దకు వచ్చాడని , బస్టాండ్ లో  కూర్చున్న చోటే అనుకోకుండా మృతిచెందాడని  అప్పడికి  ఎవరు గుర్తు పట్టకుండా వ్యక్తి ఉన్నాడని  తెలిపారు. ప్రయాణికులు ఉదయం చూస్తున్నప్పడికి, అక్కడే మృతదేహం పడి ఉన్నప్పడికి  తాగీ పడుకున్నాడని అనుకున్నారు. ఎప్పుడు చనిపోయాడో ఎవరికి తెలిక పోవడంతో బస్టాండ్ లోని ప్రయాణికులకు అక్కడున్న వారికి  అనుమానం  కల్గడంతో  జుక్కల్ మండలంలోని  పలు వాట్సాప్ గ్రూపులలో విడీయేాలను, ఫోటోలను తీసీ షేర్ చేయడంతో స్థానికులు ప్రజలు గుమ్మిగుడారు. అనంతరం జుక్కల్ పోలీసులకు సమాచారం అందించారని వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని  మృతదేహం గుర్తించి కుటింబికులకు , మృతుడి బార్యకు సమాచారం అందించామని తెలిపారు.

Spread the love