550 గ్రాముల ఎండు గంజాయి పట్టివేత..

నవతెలంగాణ- కంటేశ్వర్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 550 గ్రాముల ఎండు గంజాయి పట్టుకున్నట్లు నిజామాబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్ సీఐ విలాస్ గురువారం తెలిపారు. నిజామాబాద్ ఎన్ఫోర్స్మెంట్ ఎక్సైజ్ అధికారి సీఐ. విలాస్ తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా ప్రొబిషన్ ఎక్సైజ్ అధికారి నిజామాబాదు  ఆదేశాల మేరకు, డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ నిజామాబాద్ సీఐ. విలాస్ ఆధ్వర్యంలో, గర్బాబడి నిజామాబాద్ ఏరియాకి చెందిన కోరి కమల్ సింఘ్  పాన్ షాపులో తనిఖీ చేయగా 550 గ్రాముల ఎండు గంజాయి పట్టుబడింది అని తెలియజేశారు. అక్రమంగా కలిగి ఉండి, విక్రయిస్తున్న కారణంగా అట్టి 550 గ్రాముల గంజాయినీ సీజ్ చేశారు. తదుపరి చర్యల నిమిత్తం అట్టి నేరస్తుణ్ణి అరెస్ట్ చేసి ఎస్.హెచ్.ఓ నిజామాబాద్ నందు అప్పజెప్పారు. ఈ దాడులలో ఎక్సైజ్ సీ.ఐ విలాస్, ఎస్.ఐ గంగాధర్ మరియు సిబ్బంది సలీం, సాగర్ రావ్, గోపి, కార్తిక్, కిరణ్ కుమార్, నీలీరాజు పాల్గొన్నారు.
Spread the love