ఉద్యోగుల మూకుమ్మడి సెలవులు విమానాలు రద్దు.. 25 మందిపై వేటు

నవతెలంగాణ – హైదరాబాద్: ఎయిర్‌ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. మూకుమ్మడి సెలవులు పెట్టిన 25 మంది క్రూ సిబ్బందిని తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఎయిర్‌ ఇండియా. సంస్థ సర్వీస్‌ రూల్స్‌ ఉల్లంఘించిన కారణంగా తక్షణం వారిని తొలగిస్తున్నట్టు పేర్కొంది ఎయిర్ ఇండియా. సరైన కారణం లేకపోయినా కావాలనే సెలవు పెట్టారని, ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఇదంతా చేశారని తెలిపింది. మరిన్ని తొలగింపులు ఉంటాయన్న ఎయిర్ ఇండియా…మూకుమ్మడి సెలవులు పెట్టిన 25 మంది క్రూ సిబ్బందిని తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Spread the love