చీకట్లో ఇసుక మాఫియాకు బ్రేక్ లేవి..?

నవతెలంగాణ – ఉప్పునుంతల

ఉప్పునుంతల మండలంలో ఇసుక మాఫియాకు అడ్డూ అదుపు లేకుండా పోయింది దుందుభి వాగు పరివాహక ప్రాంతామైనా పెద్దాపూర్, మొల్గర, సదగోడు గ్రామాలలో ఈ దందా జోరుగా నడుస్తుంది. ఇసుక డంపులు చేసిన నిల్వలను రాత్రి వేళలో ట్రాక్టర్లలో టన్నులకొద్దీ అచ్చంపేట పట్టణానికి తరలిస్తూ డబ్బులు కాజేస్తున్నారు. ఇటు పోలీసులు, అటు రెవెన్యూ, మైనింగ్ అధికారులకు నెలనెలా మామూళ్లు ముట్ట జెప్తూ వారి అండతో ఇసుక మాఫియా మరింత రెచ్చిపోతుంది. అనుమతులు లేకపోయినా పగలు, రాత్రి తేడా లేకుండా రోజు వందలాది ట్రిప్పులు ఇసుకను తరలిస్తున్నారు. కేవలం ఈ ఇసుక మాఫియాను నమ్ముకోనే కొందరు ఆఫీసర్లు ఈ దంత నడిచే మండలాల్లో పోస్టింగ్ ఇప్పించుకుంటున్నారంటే.. ఇసుక దందా ఏ స్థాయిలో కాసుల వర్షం కురిపిస్తుందో అర్థం చేసుకోవచ్చు
Spread the love