విద్యుత్ షాక్ తో రైతు మృతి


నవతెలంగాణ మద్నూర్: మద్నూర్ మండలంలోని చిన్న ఎక్లారా గ్రామానికి చెందిన కౌలస్కర్ రాములు(52) అనే వ్యక్తి విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. ఎస్సై కృష్ణారెడ్డి తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. చేనులో మొక్కజొన్న పంటకు నీటిని వదులుతుండగా అకస్మాత్తుగా బోరు బందు కావడం ఏమీ జరిగిందోనని శివారు ప్రాంతంలోని ట్రాన్స్ ఫార్మర్ వద్దకు వెళ్లి హ్యాండిల్ ముట్టుకోగా కరెంట్ షాక్ తో రైతు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని శవపంచనామ జరిపి పోస్ట్ మార్టం నిమిత్తం మద్నూర్ ప్రభుత్వాసుపత్రికి శవాన్ని తరలించినట్లు తెలిపారు.

Spread the love