భర్తను కడతెరిచిన భార్య..

– వివాహేతర సంబంధమే కారణం
– ఇద్దరూ పిల్లలు ఉండగా దారుణానికి ఓడగట్టిన భార్య
– పోలీసుల అదుపులో హత్య చేసిన నిందితులు
నవతెలంగాణ- కంటేశ్వర్
నిజామాబాద్ దక్షిణ మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో మల్లారం గండిలో ఓ వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గత రెండు రోజులుగా పోలీసులు విచారణ జరిపి నిందితులను పోలీసులు తమ అదుపులోకి తీసుకొని విచారించినట్లు తెలిసింది. పంచ భూతల సాక్షిగా, అందరి ఆశీర్వాదంతో ఏడడుగులతో ఒక్కటైన భర్తను కడతేర్చింది ఓ కర్కాటకురాలైన భార్య వివాహేతర సంబంధం పెట్టుకొన్న వ్యక్తితో కలిసి అతి దారుణంగా గొంతు కోసి హత్య చేసింది.  పూర్తి సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఇంద్ర పూర్ ప్రాంతానికి చెందిన సయ్యజీ అశ్విని ఇరువురు దంపతులు..అయితే అశ్విని మరో వ్యక్తితో వివాహేత సంబంధం కొన ఇస్తున్నట్టు సమాచారం ఈ నేపథ్యంలో వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే పక్కా పధకం ప్రకారం భార్య అశ్విని, మరియు వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న యువకుడు మరి కొందరి సహాయంతో నిజామాబాద్ శివారులోని మల్లారం సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి మద్యం సేవించారు. జారుకోగా కాళ్లు చేతులు పట్టుకుని పదునైన కత్తితో గొంతు కోసి భర్తను అతి దారుణంగా హత్య చేసినట్టు సమాచారం. ఈ ఘటన మిట్ట మధ్యాహ్నం జరగగా శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలోకు వచ్చింది.. విషయం తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేయగా మృతుడి కుడి చేతిపై తన కూతురు పేరు గాయత్రి అని పచ్చబొట్టుతో  ఉన్నట్లు రూరల్ పోలీసులు గుర్తించారు. అయితే మల్లారం సమీపంలోని అటవీ ప్రాంతంలో పేకాట,చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతాయని అనేది బహిరంగ రహస్యమే. ఈ కేసులో పూర్తిగా భర్తను చంపడానికి పక్కాగా భార్య ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. 24 గంటల నుండి 48 గంటల్లోనే కేసును చేదించి ప్రధానంగా భార్యను అలాగే వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తిని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకోవడంపై ఉన్నతాధికారులు నిజామాబాద్ సౌత్ రూరల్ సిఐ వెంకటరమణ, రూరల్ ఎస్సై మహేష్ తో పాటు సిబ్బందిని నిజామాబాద్ పోలీస్ శాఖ అభినందించింది.
Spread the love