మూడుముక్కలాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు

నవతెలంగాణ -జక్రాన్ పల్లి : మండలంలోని ఆర్గుల్ గ్రామ శివారులో పేకాట స్థావరం పై శనివారం జక్రాన్ పల్లి పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా ఎస్సై తిరుపతి మాట్లాడుతూ ఆర్గుల్ గ్రామ శివారులో పేకాట అడుతున్నట్లు పక్కా సమాచారం మేరకు పేకాట స్థావరం పై దాడి చేశామన్నారు. పేకాట ఆడుతున్న ముగ్గురిని అరెస్టు చేసి వారి వద్ద నుండి రూ. 3,520 నగదును స్వాధీన పరుచుకొని వారిపై కేసు నమోదు చేశామని తెలిపారు. అదే విధంగా మండలంలో ఎక్కడైనా పేకాట ఆడినట్లు తెలిస్తే ఎస్సై 87712659853 నంబర్ కు కానీ 100 కు కానీ సమాచారం ఇవ్వాలని కోరారు.

Spread the love