నవతెలంగాణ – నిజాంసాగర్
నిజం సాగర్ మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామ శివారులోని జాతీయ రహదారి 161 పై రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన లలయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు తెలిపిన ప్రకారము లలయ్య తన మనవడు జ్ఞానూ తో కలిసి తమ టీవీఎస్ వాహనంపై పిట్లం మండల కేంద్రానికి బయలుదేరారు ఇదే సమయంలో హైదరాబాద్ నుంచి వస్తున్న కారు అతివేగంగా వచ్చి లాలయ్య వాహనాన్ని బలంగా ఢీకొట్టడంతో లాలయ్య అక్కడికక్కడే మృతి చెందాడు మనవడు జ్ఞాను కు తీవ్ర గాయాలు కాగా అతనికి జాతీయ రహదారి అంబులెన్స్ లో సంగారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు విషయం తెలుసుకున్న లాలయ్య భార్య సంఘటన స్థలానికి వచ్చి బోరున విలపించింది రోడ్డు ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న నిజం సాగారు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.