బాచుపల్లి గోడ కూలిన ఘటనలో ఆరుగురు అరెస్ట్

నవతెలంగాణ – హైదరాబాద్‌: నగర శివారు బాచుపల్లిలో గోడ కూలి ఏడుగురు మృతి చెందిన ఘటనలో అధికారులు చర్యలు చేపట్టారు. ఆరుగురిని అరెస్టు చేశారు. భవన నిర్మాణదారుడు అరవింద్‌రెడ్డి, సైట్‌ ఇంజినీర్‌ సతీష్‌, ప్రాజెక్టు మేనేజర్‌ ఫ్రాన్సిస్‌, గుత్తేదారు రాజేశ్‌, మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిని నేడు కోర్టులో హాజరు పరచనున్నారు. మరోవైపు ఈ ఘటనలో మృతి చెందిన ఏడుగురి మృతదేహాలకు శవపరీక్ష పూర్తి చేసిన అనంతరం వారి బంధువులకు అప్పగించారు.

Spread the love