పేకాట స్థావరాలపై టాస్క్ ఫోర్స్ మెరుపు దాడులు

– 16 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్ 39,470 స్వాధీనం చేసుకున్న పోలీసులు

నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆరో పోలీస్ స్టేషన్ పరిధిలో పక్క సమాచారం మేరకు మంగళవారం టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించగా 16 మంది పేకాటరాయలను అరెస్టు చేసి వారి వద్ద నుండి 39వేల 470 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ ఏసిపి రాజశేఖర్ రాజ్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ఆదేశాల మేరకు ఏసీపి రాజశేఖర్ రాజ్ ఆధ్వర్యంలో సిఐలు  అజయ్ బాబు, అంజయ్య, సిబ్బంది 6టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ 16 మంది పేకాట రాయుళ్లు 39,470 రూపాయలు సీజ్ చేయడం జరిగింది అని తెలిపారు. తదుపరి విచారణ నిమిత్తము 6 టౌన్ ఎస్ హెచ్ ఓ కి అప్పగించడం జరిగింది.
Spread the love