నవతెలంగాణ-హైదరాబాద్ : రెండు తెలుగురాష్ట్రాల్లో ఎన్నికల సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది . ఈ నెల 13 న జరుగునున్న పోలింగ్ను దృష్టిలో ఉంచుకుని సొంత ప్రాంతాలకు వెళ్లే వారి కోసం 22 రైళ్లకు అదనపు కోచ్లను ఏర్పాటు చేసింది . మే 10 నుంచి 14వ తేదీ వరకు ఆయా రైళ్లలో థర్డ్ ఏసీ, సెకెండ్ ఏసీ, స్లీపర్, చైర్కార్లలో అదనపు కోచ్లను ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ రాకేశ్ తెలిపారు. అదనపు కోచ్ల ఏర్పాటు వల్ల వెయిటింగ్ లిస్ట్లో ఉన్న ప్రయాణికులకు కొంత ఉపశమనం కలగనుందని ఆయన వెల్లడించారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.