RCB vs PBKS: టాస్ గెలిచిన పంజాబ్.. బెంగళూరు బ్యాటింగ్

నవతెలంగాణ-హైదరాబాద్ : ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు-పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ధర్మశాల వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో.. టాస్ గెలిచిన పంజాబ్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా.. పాయింట్ల పట్టికలో 7,8వ స్థానాల్లో ఉన్న ఈ జట్లు కేవలం విజయం కోసమే ఆడుతున్నాయి. వీరిలో ఎవరూ గెలిచినా ప్లే ఆఫ్స్ కు వెళ్లడం కష్టమే అయినప్పటికీ, గెలిచిన జట్టు పాయింట్ల పట్టికలో కాస్త ముందుకెళ్తుంది.

Spread the love