వ్యాన్‌కు వ్యాపించిన మంటలు..పేలి గాల్లోకి ఎగిరిన వాహనం

నవతెలంగాణ-హైదరాబాద్ :  మండే వేసవి వల్ల పలు వాహనాలకు అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒక వ్యాన్‌కు మంటలు వ్యాపించాయి. అయితే ఉన్నట్టుండి పేలడంతో ఆ వాహనం గాల్లోకి ఎగిరింది. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గురువారం ఖాన్పూర్ ప్రాంతంలో పార్క్‌ చేసిన మారుతీ వ్యాన్‌లో మంటలు చెలరేగాయి. సుమారు 20 నిమిషాలపాటు ఆ వాహనం కాలిపోయింది. అనంతరం పెట్రోల్‌ ట్యాంకు పెద్ద శబ్దంతో పేలడంతో ఆ వ్యాన్‌ గాల్లోకి ఎగిరి పడింది. కాగా, ఇది చూసి స్థానికులు భయాందోళన చెందారు. అక్కడి నుంచి పరుగులు తీశారు. అయితే ఆ వ్యాన్‌ సమీపంలో ఎవరూ లేకపోవడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగలేదు. మరోవైపు ఈ వీడియో క్లిప్‌ సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యింది. సినిమాలో మాదిరిగా మంటల్లో కాలిన వ్యాన్‌ గాల్లోకి ఎగురడం చూసి నెటిజన్లు కూడా షాక్ అయ్యారు. కాగా, వేసవి కాలంలో వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అగ్నిమాపక అధికారులు సూచించారు.

Spread the love