నవతెలంగాణ-హైదరాబాద్ : బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గురువారం నిర్మల్ జిల్లా బైంసాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పట్టణంలోని పాత చెక్పోస్ట్ కార్యాలయం కూడలి వద్ద కార్నర్ మీటింగ్లో పాల్గొన్నారు. ఆ సమయంలో కొందరు కేటీఆర్కు వ్యతిరేకంగా ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఆయన వాహనంవైపు వెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని నిలువరించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేటీఆర్ ప్రసంగిస్తుండగా.. జన సమూహంలో నుంచి కొందరు విసిరిన ఉల్లిగడ్డలు, టమాటాలు.. ప్రచార వాహనం సమీపంలో కిందపడ్డాయి. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీటింగ్ పూర్తయిన తర్వాత ఆందోళన కారులను పోలీసులు చెదరగొట్టారు.