నవతెలంగాణ – వేములవాడ రూరల్
వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేట గ్రామంలోని నక్కవాగు బుధవారం రాత్రి కురిసిన మోస్తారు వర్షానికి వాగు ప్రవహిస్తుంది. నక్క వాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణం సగం వరకు మాత్రమే పూర్తికావడంతో వాహనదారులు వెళ్లడానికి తాత్కాలికంగా మట్టితో వేసిన రోడ్డు వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. దీంతో గ్రామంతో పాటు చుట్టూ ఉన్న గ్రామాల ప్రజల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. వేములవాడ, సిరిసిల్లకు వెళ్లాలంటే లింగంపల్లి మీదుగా తమ వాహనాలను మళ్లిస్తున్నారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం బ్రిడ్జి నిర్మాణాన్ని పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.