వెల్నెస్ సెంటర్కు వసతి కల్పించాలి

నవతెలంగాణ- కంటేశ్వర్
పాత మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ప్రస్తుతం కొనసాగుతున్న  ఎంప్లాయిస్, పెన్షనర్స్,  జర్నలిస్టుల వెల్నెస్ సెంటర్ నిర్వహణకు ప్రస్తుతం  ఉన్న వసతి సరిపోవటం లేదని, డెంటల్, ఫిజియోథెరపీ, ఈసీజీకు సంబంధించిన విలువైన సామాగ్రి  వినియోగించుకునేందుకు వసతి లేక మూలన పడి ఉన్నాయని, తెలంగాణ ఆల్ పెన్షనర్స్& రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ బుధవారం జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేసింది. నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ తో మాట్లాడి వెల్నెస్ సెంటర్ కు అదనపు వసతి కల్పింస్తామని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు జిల్లా అధ్యక్షులు కే రామ్మోహన్రావు తెలిపారు. పెన్షనర్స్ డే సందర్భంగా కలెక్టర్ నీ సన్మానించి జ్ఞాపికను బహుకరించారు. కలెక్టర్ ని కలిసిన వారిలో సంఘం జిల్లా నాయకులు ఈవీఎల్ నారాయణ, ప్రసాదరావు, శిర్ప హనుమాన్లు ,అందే సాయిలు, ఆజాద్ తదితరులు ఉన్నారు.
Spread the love