ఆర్థిక ఇబ్బందులతో ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య

నవతెలంగాణ – మాక్లూర్
ఆర్థిక ఇబ్బందులతో యువకుడు చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని వేణు కిషన్ నగర్ తండాలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల  కథనం ప్రకారం మండలంలోని వేణు కిసాన్ నగర్ తాండకు చెందిన మాలోవత్ సుందర్ సింగ్(36) అనే  యువకుడు కుటుంబ ఆర్థిక ఇబ్బందులతో  ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిపారు. మృతుడు దుబాయ్ వెళ్లి అప్పుల పలైనట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్సై సుధీర్ రావు తెలిపారు
Spread the love