విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులు నడపాలి: ఏబీవీపీ 

నవతెలంగాణ – డిండి: విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులు నడవాలని ఏబీవీపీ డిండి పట్టణ కార్యదర్శి గొర్రె కార్తీక్ శనివారం విలేకరుల సమావేశంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… డిండి నగరానికి వస్తున్న విద్యార్థులు బస్సుల వల్ల సమస్యలు ఎదురుకుంటున్నారని, బస్సులు సమయానికి రాక కళాశాలలకు స్కూళ్లకు లకు వెళ్లే విద్యార్థులు ఇబ్బంది పడ్తున్నారన్నారు..బస్సులలో సామర్థ్యనికి మించి ప్రయాణం చేస్తున్నారని దీని వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నదని, ప్రయాణికుల ప్రాణాలు దృష్టిలో ఉంచుకొని తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థుల కళాశాల సమయం దృష్టిలో పెట్టుకొని సరైన సమయానికి బస్సులు నడపాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యుడు సన్నీబాబు, కాలేజ్ కార్యదర్శి ఎన్. ప్రవీణ్,  కళాశాల ప్రెసిడెంట్  సంతోష్, కళాశాల జాయింట్ సెక్రెటరీ సాయి కిరణ్,  కళాశాల సోషల్ మీడియా ఇన్చార్జ్ అరవింద్ విద్యార్థులు పాల్గొన్నారు.
Spread the love