ప్రమాదవశాత్తూ సఫాయి కార్మికుడు మృతి..

నవతెలంగాణ – ధర్మవరం 
మండలంలోని నంది మేడారం గ్రామానికి చెందిన గ్రామపంచాయతీ సపాయి కార్మికుడు వెల్తూరి సత్తయ్య (55) ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వాటర్ ట్యాంక్ కింద పనిచేస్తుండగా, వాటర్ ట్యాంక్ పై ఉన్న వాటర్ బోర్డు ప్రమాదవశాత్తూ అతనిపై పడింది. దీంతో తీవ్ర గాయాలైన సత్తయ్యను కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స చేస్తుండగా మృతి చెందాడని వైద్యులు తెలిపారు. మృతుని భార్య నెల్లూరి శంకరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్సై టి సత్యనారాయణ తెలిపారు.
Spread the love