ఆటో బోల్తా.. ఒకరు మృతి, పలువురికి గాయాలు

నవతెలంగాణ – ధర్మారం 
మండలంలోని గోపాలరావుపేట గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ పోతు లచ్చయ్య, (53)  అను వ్యక్తి  కాంగ్రెస్ పార్టీ మీటింగ్ కు వచ్చి వెళ్తున్న క్రమంలో ఆటో ను అతి వేగంగా, అజాగ్రత్తగా నడపగా మణికంఠ పాఠశాల వద్ద బోల్తాపడగా అందులో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలు కాగా, వెంటనే కరీంనగర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా.. ప్రమాద బాధితుల్లో ఒకరైన జంగిలి బక్కయ్య(62) గురువారం రాత్రి చికిత్స పొందుతూ మృతి చెందాడని, స్థానిక ఎస్సై టీ సత్యనారాయణ తెలిపారు.  మృతుని భార్య జంగిలీ నరసక్క ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆటో డ్రైవర్ లచ్చయ్య పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై టీ సత్యనారాయణ తెలిపారు.
Spread the love