నవతెలంగాణ ముత్తారం: మండ లంలోని ఓడేడ్ మానేరు పై రెండు జిల్లాలను కలుపుతూ నిర్మిస్తున్న బ్రిడ్జి పై ఉన్న గ్యాడర్లు భారీ గాలికి పడిపోయాయి. సోమ వారం రాత్రి 10:30 గంటలకు ఒకేసారి భారీ గాలి రావడంతో పిల్లర్లపై నున్న గ్యాడర్లు మూడు కిందపడి పోయాయి. మానేరులో వాహ నాలు వెళ్లేందుకు తాత్కాలిక మట్టి రోడ్డు నిర్మించారు. నిత్యం ఆ రహదారి కూడా వాహనాలు రవాణా జరుగుతుంటాయి రాత్రివేళ కావడంతో రహదారి గుండా వాహనం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు ఏండ్లు గడుస్తున్న నామమాత్ర పనులతో కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వల్లే ప్రమాదం సంభవించిందని స్థానికులు తెలిపారు.