అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టిన కారు

నవతెలంగాణ – శంకరపట్నం
చెట్టును ఢీకొన్న కారు.. పూర్తి వివరాల్లోకి వెళితే శంకరపట్నం మండల పరిధిలోని మొలంగూర్ హెచ్.పీ గ్యాస్ గోదాం దగ్గర హుజురాబాద్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన ముద్రవేణి ప్రభాకర్ (45) లు ఆదివారం కొండపల్క లకు దశదినకర్మ కు వెళ్లి వస్తుండగా, సోమవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో నిద్రమత్తులో కారు అదుపుతప్పి చెట్టు కు ఢీకొట్టగా, ప్రభాకర్ తో పాటు మరో ఇద్దరూ తన బాబాయ్ గోనెల సుదర్శన్( 70), సుదర్శన్ వాల్ల మనవరాలు గోనెల శ్రీ వర్షిని (10) వీరి ముగ్గురికి కాళ్లు విరిగాయి. వీరిలో సుదర్శన్ పరిస్థితి విషమంగా ఉండడంతో అటుగా వెళ్తున్న ప్రయాణికులు చూసి 108 కు ఫోన్ చేయడంతో వెంటనే స్పందించిన సిబ్బంది ఈఎంటి సతీష్ రెడ్డి, పైలట్ గోపికృష్ణ, లు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందిస్తూ హుజురాబాద్ ఏరియా హాస్పిటల్ కు తరలించారు.

Spread the love