పెట్రోల్ తో మహిళ ఆత్మహత్యాయత్నం

నవతెలంగాణ – శంకరపట్నం
ఇల్లు కట్టుకోవడానికి కార్యదర్శి పర్మిషన్ ఇవ్వడంలేదని  మహిళ గ్రామపంచాయతీ ముందు  పెట్రోల్ తో  ఆత్మహత్యయత్నం చేసిన ఘటన  పూర్తి వివరాల్లోకి వెళితే శంకరపట్నం మండల పరిధిలోని మొలంగూర్ గ్రామానికి చెందిన పూస శివకుమారి (40)కి  రెండున్నర గుంటల స్థలంలో ఇప్పటికే పునాది తీసి పిల్లర్స్ వేసుకొని ఉంది. ఇల్లుకు పర్మిషన్ కావాలని శుక్రవారం మొలంగూర్ గ్రామ పంచాయతీ వద్దకు వెళ్లి కార్యదర్శి మమతను ఇల్లు పర్మిషన్ కోసం అడగగా కార్యదర్శి నిరాకరించటంతో అప్పటికే మహిళ వెంట తెచ్చుకున్న పెట్రోల్ మీద పోసుకొని ఆత్మహత్యయత్నం చేసుకుని, తనకు న్యాయం చేయాలని వేడుకుంది.

Spread the love