కార్ ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

నవతెలంగాణ – శంకరపట్నం
కారు ఢీకొని వ్యక్తికి గాయాలైన ఘటన వివరాల్లోకి వెళితే మానకొండూరు మండలం గట్టుదుద్దనపల్లి గ్రామపంచాయతీ వద్ద తిమ్మాపూర్ మండలం పోలంపల్లి గ్రామానికి చెందిన పెరక శ్రీనివాస్, (50 )తన ప్రత్యేక అవసరాలు నిమిత్తం ఆదివారం గట్టు దుదనపల్లికి వచ్చి వెళ్తుండగా వెనక నుండి కారు ఢీకొనగా తలకు తీవ్ర గాయాలయ్యాయి. అది చూసిన స్థానికులు 108 ఫోన్ చేయడంతో సిబ్బంది ఈ ఎం టి సతీష్ రెడ్డి పైలెట్ గోపికృష్ణ, సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రున్ని ప్రథమ చికిత్స అందిస్తూ కరీంనగర్ గవర్నమెంట్ హాస్పిటల్ తరలించినట్లు సిబ్బంది తెలిపారు.

Spread the love