నవతెలంగాణ – తాడ్వాయి
తాడువాయి మండలం దేనికలాం గ్రామంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు తాడువాయి ఏఎస్ఐ సంజీవ్ తెలిపారు. మండలంలోని కన్కల్ గ్రామానికి చెందిన కౌడి శ్రీకాంత్ చిన్నతనం నుండి దేమికలాన్ లో మేనత్త దగ్గర ఉంటున్నాడు. ఆయన ఇంటర్ వరకు చదువుకున్నాడు. వ్యవసాయం, వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం ఉదయం ఇంటి నుంచి వెళ్లి రాత్రి వరకు రాలేదు. రాత్రి 11:30 గంటలకు ఇంటికి వచ్చాడు .ఇంట్లో ఉన్న మేనత్త ఇంతసేపు ఎటు వెళ్లావు, రాత్రికి వరకు ఇంటికి రాకుంటే ఎలా ప్రతిరోజు తాగి తిరుగుతున్నావు అని మందలించడంతో ఆయన మనస్థాపానికి గురై అక్కడి నుంచి వెళ్ళిపోయి శ్రీకాంత్ గ్రామ శివాలోని ఓ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు .రాత్రి సమయంలో ఇంటికి రాకపోవడంతో మంగళవారం ఉదయం గ్రామ శివారులో వెతుకగా ఓ చెట్టుకు వేలాడుతూ కనిపించాడు. ఈ విషయమై కౌడి రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు మృతుడు శ్రీకాంత్ కు ఇంకా వివాహం కాలేదు ఈ విషయమై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ. సంజీవులు వివరించారు.