కొప్పుల ఈశ్వర్ గెలుపు కోసం ఇంటింటి ప్రచారం 

నవతెలంగాణ – ధర్మారం 
మండలంలోని మల్లాపూర్, గోపాలరావుపేట్ తండాబి గ్రామాలలో టిఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గెలుపు కోసం బిఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గతంలో కొప్పుల ఈశ్వర్ సంక్షేమ శాఖ మంత్రిగా ఎమ్మెల్యేగా గ్రామాలకు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందించిన సంక్షేమ సేవా కార్యక్రమాల గురించి వివరించి కొప్పుల ఈశ్వర్ కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఉపాధి హామీ పనుల వద్దకు వెళ్లి ఉపాధి హామీ కూలీలతో మాట్లాడి ఓట్లను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు రాచూరి శ్రీధర్, నంది మేడారం పిఎసిఎస్ చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి, పార్టీ మండల కార్యదర్శులు కూరపాటి శ్రీనివాస్, దొరికిన తిరుపతి గౌడ్, నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
Spread the love