విద్యార్థులు చదువుతో పాటు ఆటలలో మంచి పేరు తీసుకరావాలి

– కాకర్లపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పెన్నులు అందజేసిన మెండే రాజేశ్వరి-రాజయ్య
నవతెలంగాణ – మంథని
మంథని మండలం కాకర్లపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులకు గ్రామానికి చెందిన మెండే రాజేశ్వరి – రాజయ్య విద్యార్థులకు పెన్నులు అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ…విద్యార్థులకు వేసవి కాలం ఫైనల్ పరీక్షలు ప్రారంభం అవుతున్నందున ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు పెన్ను లు పంపిణీ చేశామన్నారు. అదే విధంగా ముందు ముందు గ్రామంలో మరిన్ని మంచి సేవ కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు ఆటలలో ముందు ఉండి తల్లిదండ్రులకు, ఉన్న ఊరుకు మంచి పేరు తీసుకరావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కోట లక్ష్మణ్, సహోపాధ్యాయుడు ఎల్. రమేష్, గ్రామస్తులు ఎనగందుల శేఖర్, తదితరులు ఉన్నారు.
Spread the love