బీజేపీకి ఓటు వేస్తే ఉరేసుకున్నట్లే: ఎమ్మెల్యే

నవతెలంగాణ – ఎల్లారెడ్డి ( లింగంపేట్)
బీజేపీ పార్టీకి ఓటు వేస్తే మన మెడకు ఉరేసుకున్నట్లయినని ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ రావు తీవ్రస్థాయిలో విమర్శించారు. గురువారం రాత్రి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ మతం పేరుతో, కులం పేరుతో, గ్రామాల్లో దేవుని పేరుతో రాజకీయం చేస్తుందన్నారు. బీబీ పాటిల్ ఎందుకోసం ఎంపీ గా పోటీ చేస్తున్నాడు. పది సంవత్సరాలనుండి ఏం చేసాడని ఆయన ప్రశ్నించారు. ఎంపీ బీబీ పాటిల్ నియోజకవర్గంలో ఏ ఒక్క గ్రామంలోనైనా తిరిగి ఒక్క కుటుంబాన్ని అయినా ఆదుకున్నాడా అన్నారు. 2021 లో పాత్రికేయ మిత్రులపైన బీబీ పాటిల్ పరువు నష్టం కేసు వేస్తానని బెదిరించాడని అప్పుడు నేను పాత్రికేయ మిత్రులకు అండగా ఉన్నాను. మాస్టర్ ప్లాన్ లో రైతులను మోసం చేసాడు. ఆయన అన్నారు. వ్యాపారంలో కాంట్రాక్టు అయిపోయినట్టు బీఆర్ఎస్ పార్టీ పార్టీ తో కాంట్రాక్టు అయిపోగానే బీజేపీ తో కాంట్రాక్ట్ చేసుకున్నాడని ఆయన మండిపడ్డారు. నియోజకవర్గ యువకులకు ఒక్క ఉద్యోగం ఇప్పించకుండా క్యాబ్ డ్రైవర్లుగా, స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్ గా యువకులను చేశాడన్నారు. ఒక్క ఉద్యోగం ఇవ్వలే, ఒక్క ఇల్లు ఇవ్వలే, ఒక్క రోడ్డు వెయ్యలేదు చివరికి వచ్చిన నిధులను కూడా వాపస్ పంపిన ఘనత మన ఎంపీ బీబీ పటేల్ గారికి దక్కిందన్నారు అన్నారు.  దయచేసి రైతులు, యువకులు అందరూ ఆలోచించండి ఆయన ఓటర్లను వేడుకున్నారు.బీజేపీ కి ఓటు వేస్తె మూలకున్న కొయ్యను తీస్కొని మన మెడకు ఉరి వేసుకున్నట్టే ఆయన అన్నారు. దయచేసి ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేసి గెలిపించండి అద్భుతమైన  అభివృద్ధిని చేసుకుందాం మనీ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతో  సాధ్యమన్నారు.
Spread the love