పంటలను పరిశీలించిన వ్యవసాయ అధికారులు

నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని రామేశ్వరపల్లి గ్రామంలో రైతుల సాగుచేసిన వరి పంటను మండల వ్యవసాయ అధికారిని రాధా పరిశీలించారు. ఈ సందర్భంగా పంటలకు సోకుతున్న తెగుళ్ల గురించి రైతులు వివరించారు. అధునాతన పద్ధతులలో పంటలు సాగు చేయాలని, రైతులు సాగుచేసిన పంటలకు ఎలాంటి పురుగు సోకిన వ్యవసాయ సిబ్బందిని సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తీర్ణ అధికారి వినోద్, రైతులు ఉన్నారు.
Spread the love