నవతెలంగాణ హైదరాబాద్: అక్షయ్ ఊర్జా దివస్ సందర్భంగా వేదాంత పవర్ భారతదేశ స్వచ్ఛ ఇంధన పరివర్తనలో ఇంధన, వనరుల సామర్థ్యానికి ప్రాధాన్యతనిస్తున్నట్లు ప్రకటించింది. 2030 నాటికి 500 గిగావాట్ల శిలాజేతర విద్యుత్ సామర్థ్యాన్ని సాధించాలనే దేశ లక్ష్యానికి మద్దతుగా, కేవలం పునరుత్పాదక శక్తిని పెంచడమే కాకుండా మొత్తం విద్యుత్ వ్యవస్థలో నీరు, ఇంధనం వంటి వనరుల వినియోగాన్ని ఆప్టిమైజ్ చేయడంపై కంపెనీ దృష్టి పెట్టింది.
దీనిలో భాగంగా తల్వండి సాబో థర్మల్ ప్లాంట్లో 3.61 లక్షల మెట్రిక్ టన్నుల బయోమాస్ను వినియోగించి సంప్రదాయ ఇంధనంపై ఆధారపడటాన్ని తగ్గించింది. ఆంధ్రప్రదేశ్లోని మీనాక్షి ఎనర్జీ లిమిటెడ్లో నిర్వహణ కోసం ఉప్పునీటిని ఉపయోగిస్తూ మంచినీటి వినియోగాన్ని సున్నాకు తీసుకువచ్చింది. అలాగే సొంత అవసరాలకు సౌరశక్తి, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం మరియు 8.75 లక్షల మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతోంది. వేదాంత గ్రూప్ తన డీకార్బనైజేషన్ ప్రయాణంలో భాగంగా సుస్థిర నిర్వహణ కోసం $1 బిలియన్ కంటే ఎక్కువ పెట్టుబడి పెడుతూ, మరింత సమర్థవంతమైన స్వచ్ఛ ఇంధన పర్యావరణ వ్యవస్థను నిర్మిస్తోంది.



