– భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ ఎస్సిసెల్ అధ్యక్షుడు దండు రమేష్
– మండల ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు
నవతెలంగాణ-మల్హర్ రావు
కేంద్రంలో కాంగ్రెస్ గెలుపుతోనే సకల జనులకు సంక్షేమ పథకాలు అందుతాయని,అలాగే ఉపాధిహామీ కూలీలకు 200 పని దినాలు పెంపుతోపాటు,రూ.400 వేతనాలు అందుతాయని భూపాలపల్లి కాంగ్రెస్ ఎస్సిసెల్ అధ్యక్షుడు దండు రమేష్,మండల ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు ఓటర్లను కోరారు.పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ చేతి గుర్తుకు ఓటు వేయాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బడితేల రాజయ్య ఆధ్వర్యంలో రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు,శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిళ్ల శ్రీనుబాబు ఆదేశాల మేరకు శుక్రవారం మండలంలోని తాడిచెర్ల, పెద్దతూoడ్ల,అడ్వాలపల్లి,కిషన్ రావు పల్లి గ్రామాల్లో నిర్వహించారు.పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీని గెలిపిస్తే యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు.కేంద్ర ప్రభుత్వం మేనిపేస్టో లో పెట్టిన ఐదు గ్యారెంటీలు అమలు చేయడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి కొండ రాజమ్మ,ఎంపిటిసి ప్రకాష్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి,జంపయ్య నాయక్,సింగిల్ విండో డైరెక్టర్ ఇప్ప మొoడయ్య, మండల యూత్ అధ్యక్షుడు గడ్డం క్రాంతి,యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ మండల రాహుల్, యూత్ నాయకులు సవెందర్,మంథని రాజ సమ్మయ్య, జక్కుల వెంకట స్వామి, విష్ణు వర్ధన్ రెడ్డి,రాజునాయక్,బోయిని రాజయ్య యాదవ్, వేల్పుల రవి,దోగ్గేల సంపత్,రెవెళ్లి లింగయ్య,మమత,జంగిడి సమ్మయ్య, చంద్రగిరి అశోక్, లక్ష్మీ రాజాం,శంకర్,ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.