గత ప్రభుత్వం తరుగు పేరిటరైతులను మోసం

గత ప్రభుత్వం తరుగు పేరిటరైతులను మోసం– రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు
నవతెలంగాణ:మల్హర్ రావు:-
గత ప్రభుత్వం తరుగు పేరిట రైతులను మోసం చేసిందని తెలంగాణ రాష్ట్ర ఐటి,పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు ఆరోపించారు.ఈ సందర్భంగా బుధవారం పలు ఆలయాలు సందర్శించి మాట్లాడారు గ్రామ గ్రామాన ప్రజలందరూ కలిసి సీతారాముల కళ్యాణం జరపడం ఆనందదాయకమన్నారు.రామ రాజ్యం రావాలని ఆకాంక్షించారు.అదేవిధంగా రైతులకు సంబంధించి రాబోయే కాలంలో సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, వచ్చే ఖరీఫ్ కు సంబంధించిన రైతు సోదరులకు ఎక్కడ ఇబ్బంది రాకుండా ఆ రైతన్నలకు స్వామి వారి ఆశీర్వాదం ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.గత ప్రభుత్వం తరుగు పేరిట రైతులను మోసం చేసిందన్నారు.పూర్తిస్థాయిలో ఎక్కడ కూడా ఒక గింజ కూడా తరుగు పేరిట రైతులను మోసం చేయకుండా కొనుగోలు చేసే విధంగా అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. రెండు మూడు రోజులలో కనీస మద్దతు ధర తో ధాన్యం కొనుగోలు చేస్తామని, రైతులకు న్యాయం జరిగే విధంగా చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు ప్రజాప్రతినిధులు భక్తులు ప్రజలు పాల్గొన్నారు

Spread the love