టీ కొట్టు వద్ద టీ, టిఫిన్ చేసిన

– రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖ శ్రీధర్ బాబు
– తండ్రి స్వభావాన్ని అందిపుచ్చుకున్న దుద్దిళ్ల
నవతెలంగాణ: మల్హర్ రావు.
తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కలుపుకోరు తనానికి అందరిలోనూ ఆశ్చర్యం వ్యక్తం అవుతుంది. సోమవారం రాత్రి మంథని పట్టణంలోని నాగరాజు స్వీట్ హౌస్ వద్ద మంత్రి శ్రీధర్ బాబు వాహనం ఆగడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అనంతరం ఆయన స్వీట్ హౌస్ లోకి పోయి అక్కడ ఒక ప్లేట్ ఇడ్లీ తిని టీ తాగారు. ఒక సామాన్య మానవుడిలా శ్రీధర్ బాబు ఇక్కడికి రావడం ఎంతో ఆనందం కలిగించిందని స్వీట్ హౌస్ యజమాని నాగరాజు తెలిపారు.శ్రీధర్ బాబు మనస్తత్వంలో ధనవంతులు పేదవారు అనే వేదాభిప్రాయం ఎప్పుడూ ఉండదు. తన తండ్రి దివంగత శాసనసభ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు లాగానే ప్రతి ఒక్కరిని ప్రేమతో పలకరించే స్వభావం అందరిని ఆకట్టుకుంటుంది. అనంతరం శ్రీధర్ బాబు ఆ ప్రాంతంలో వ్యాపారస్తులు ఏమైనా సమస్యలు ఎదురవుతున్నాయని వారిని ప్రశ్నించారు. సమస్యలు ఏవైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శశిభూషణ్ కాచే,మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అయిలీ ప్రసాద్, సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, మాజీ సర్పంచ్ శ్రీనివాసులు ఉన్నారు

Spread the love