కాంగ్రెస్ ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి గా అలుకట శ్రీనివాస్ ఎన్నిక..

నవతెలంగాణ- డిచ్ పల్లి: నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ఓబిసి అధ్యక్షులు శ్రీకాంత్ ఆదేశాల మేరకు జిల్లా ఓబీసీ అధ్యక్షులు డి.రాజా నరేందర్ గౌడ్ చేతుల మీదుగా ఓ బి సి జిల్లా ప్రధాన కార్యదర్శిగా అలుకట శ్రీనివాస్ గౌడ్ ను నియమించి నియామకాపు పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ నా పై నమ్మకంతో ఓ బి సి జిల్లా ప్రధాన కార్యదర్శి గా నియామకానికి సహకరించిన మాజీ ఎమ్మెల్సీ నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ ఇంఛార్జి డాక్టర్.భూపతి రెడ్డికి, రాష్ట్ర టిపిసిసి ప్రధాన కార్యదర్శి కాట్ పల్లీ నాగేష్ రెడ్డి కి, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, టిపిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొలసాని శ్రీనివాస్, డిచ్ పల్లి అధ్యక్షులు అమృతపుర్ గంగాధర్ లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ పెద్దొల శ్రీనివాస్, మండల్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు మహమ్మద్ ఇబ్రహీం, మండల వైస్ ప్రెసిడెంట్ కర్షివ్ సుదర్శన్, మండల ఓ బి సి అధ్యక్షులు రాజన్న, నడిపల్లీ కాంగ్రెస్ అధ్యకులు దూసుగం వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.
Spread the love