- Advertisement -
నవతెలంగాణ – బొమ్మలరామారం: బొమ్మలరామారం మండలం మర్యాల జిల్లా పరిషత్ ఉన్నత ఉన్నత పాఠశాలలో 2012- 2013 సంవత్సరంలో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గురువులతోపాటు విద్యార్థులు అప్పటి తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకుని ఆత్మీయంగా ఒకరినొకరు పలకరించుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు నరసింహారెడ్డి, కృష్ణమూర్తి, జాంగిర్ అలీ,రవీందర్, గౌస్ మియాకు పూర్వ విద్యార్థులు శాలువాలు పూలమాలతో సన్మానించి మెమొంటోలను అందజేశారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల పాల్గొన్నారు.
- Advertisement -