ఆదర్శవంతమైన గాంధేయవాది లాల్ బహదూర్ శాస్త్రి

ఆయన ఆశయ సాధనకు చేసిన కృషి ప్రశంసనీయం
నవతెలంగాణ – పెద్దవూర
స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ ప్రధాని, భారతరత్న శ్రీ లాల్ బహదూర్ శాస్త్రీ 58 వర్ధంతి సందర్బంగా ఆ మహనీయునికి ఘన నివాళ్లు అర్పిస్తున్నామని బుసిరెడ్డి పౌండేషన్ ఛైర్మెన్ పాండు రంగారెడ్డి గురువారం ఆ మహనీయిన్ని స్మరించుకున్నారు. లాల్ బహదూర్ శాస్త్రి గాంధేయ వాది అని, ఆయన చేసిన సేవలు అమోఘంఅని, దేశ ప్రజలు ఆయన ఆశయ సాధనలో నడవాలని కోరుకుంటున్నానని తెలిపారు. లాల్ బహదూర్ శాస్త్రికి మా హృదయపూర్వక నివాళి అర్పిస్తున్నాము. ఒక సరళత కలిగిన వ్యక్తి, అతను మనకు ‘జై జవాన్, జై కిసాన్’ అనే ఐకానిక్ నినాదాన్ని అందించారని, దేశం పట్ల ఆయనకున్న అత్యంత అంకితభావానికి, ఆయన వారసత్వాన్ని గౌరవిస్తున్నామని, కష్టపడి పనిచేసే భారత పౌరులందరూ తమ హక్కులను పొందేలా శాస్త్రిజీ చూపిన మార్గం మనకు స్ఫూర్తినిస్తుంది కొనియాడారు. 
Spread the love