ఎమ్మెల్యే గా అనిల్ కుమార్ రెడ్డి ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి

నవతెలంగాణ -వలిగొండ రూరల్:  రానున్న సార్వత్రిక  అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్తి కుంభం అనిల్ కుమార్ రెడ్డి ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులు గుఱ్ఱం లక్ష్మారెడ్డి అన్నారు . మంగళవారం మండలంలోని రెడ్లరేపాకలో, గోపరాజు పల్లి, అప్పారెడ్డి పల్లె, గొల్నేపల్లి లో స్థానిక నాయకులతో ఇంటింటి ప్రచారం నిర్వహించి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించిన 6 హామీలను ఓటర్లకు వివరిస్తూ, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు చేపట్టి అభివృద్ధి తప్ప బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 9 సంవత్సరాల కాలంలో పేదలకు చేసింది ఏమిలేదని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు ఐన వెంటనే 6 హామీలను అమలు చేస్తామని ఓటర్లకు తెలిపారు. ఈ నెల 30 న జరుగనున్న ఎన్నికల్లో అనిల్ కుమార్ రెడ్డి చేతి గుర్తుకు అత్యధిక ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూతి రమేష్ రాజ్, ఎంపీటీసీ  నోముల మల్లేశం, పాశం సత్తి రెడ్డి, తుమ్మల యుగంధర్ రెడ్డి, బోళ్ళ శ్రీనివాస్, దేశబోయిన బాల స్వామీ,  పోలేపాక జానకీరాములు, పల్లెర్ల సుధాకర్, మస్కు నర్సింహా, కందుల శ్రీను, జంగం శంకర్, గాడిపెల్లి యాదయ్య, దేశబోయిన నర్సింహా  తదితరులు పాల్గొన్నారు.
Spread the love