కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించాలి: అన్నపూర్ణ

నవతెలంగాణ – నాగార్జునసాగర్ : నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించి పార్లమెంట్ కు పంపించాలని  నందికొండ మున్సిపాలిటీ ఛైర్పర్సన్ తిరులమలకొండ అన్నపూర్ణ అన్నారు. కుందూరు రఘువీర్ రెడ్డి కి ఎవరు ఊహించని భారీ మెజార్టీతో గెలవాలని కోరుతూ నందికొండ మున్సిపాలిటీ చైర్పర్సన్ అన్నపూర్ణ ఆధ్వర్యంలో పైలాన్ కాలనీలోని పోచమ్మ తల్లి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ సీనియర్ నాయకులు, 10వ వార్డు కౌన్సిలర్ తిరుమలకొండ మోహన్ రావుతో కలిసి 7,8,10వార్డు లో ఇంటింటి ప్రచారంలో భాగంగా గడప గడపకు వెళ్లి రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డిగారి సంక్షేమ పథకాలను వివరించి జరగబోయే ఎన్నికల్లో నల్లగొండ కాంగ్రెస్ అభ్యర్థి కుందూర్ రఘువీర్ రెడ్డి హస్తం గుర్తుకు ఓటు వేసి దేశాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మైనార్టీ నాయకులు, కాంగ్రెస్ యూత్ నాయకులు,  మహిళలు పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగినది.
Spread the love