ఎమ్మెల్యే అక్రమాలకు ఓట్ల రూపంలో సమాధానం

నవతెలంగాణ – మాక్లూర్
ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అక్రమాలకు, అన్యాయాలకు ఓట్ల రూపంలో ప్రజలు బుద్ది చెపుతారని ఆర్మూర్ బిజెపి నాయకుడు పైడి రాకేష్ రెడ్డి అన్నారు. అంతకుముందు హర్ ఘార్ తిరంగ కా ర్యాలీ తివర్ణ  జెండాలతో, 60ద్విచక్ర వాహనాలతో మాక్లుర్ గ్రామం నుంచి మాదాపుర్ పార్టీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం పార్టీ కార్యాలయం ప్రారబించడం జరిగింది. ఈ సందర్భంగా పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అక్రమాలు అన్యాయాలకు అతి త్వరలో ఓట్ల రూపంలో సమాధానం చెప్పాలి అని ప్రతి బీజేపీ కార్యకర్తకు ఏళ్ల వేళల తోడు ఉంటాను అని అన్నారు. బీజేపీ  ఆర్మూర్ అసేంబ్లీ కన్వీనర్ పాలేపు రాజు,  మాక్లూర్ మండల అధ్యక్షులు సురేష్ నాయక్,  బీజేవైఎం జిల్లా అద్యక్షుడు రాజశేఖర్ రెడ్డి, యువ మొర్చ ఇటి సెల్ అధ్యక్షుడు వీపుల్ రావు, అర్ముర్ రురల్ మండల అధ్యక్షులు రోహిత్ రెడ్డీ, ఓబీసీ మోర్చా అర్ముర్ అసెంబ్లీ కన్వీనర్ గంగోని వినోద్, సీనియర్ నాయకుడు గంగొని సంతోష్, ముపేడి గంగారెడ్డి, హన్మంతు, మాదాపూర్ జిట్టా పెద్దా గంగన్న, ఎం రాజేశ్వర్, ప్రణయ్, ఒడెన్న, రాజశేఖర్, సంజీవ్, హరీష్, గంగాధర్, నర్సింగ్ రావు, రాజేందర్ రెడ్డీ, సుమన్, శ్రీనాథ్, రాము, రవి యాదవ్, ఆరిఫ్ ,బాలు, కిరణ్, పుప్పాల చిన్న సంజీవ్, నరేష్ గౌడ్,బూత్ అధ్యక్షులు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది
Spread the love