- Advertisement -
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో వివిధ తరగతుల్లో ఉన్న ఖాళీలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రత్యేక అధికారిణి గంగమణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఆరవ తరగతిలో ఒక పది సీట్లు, ఏడవ తరగతిలో ఎనిమిది సీట్లు ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. విద్యాలయంలో అడ్మిషన్ అవసరమైన విద్యార్థినిలు పాఠశాల ప్రత్యేక అధికారిని గంగామని-8074403819, అడ్మిషన్ ఇంచార్జ్ జి.సునీత- 89192 20767 ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు. విద్యాలయంలో అడ్మిషన్ పొందే విద్యార్థునీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
- Advertisement -


