అర్యవైశ్యులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలి

నవతెలంగాణ – అశ్వారావుపేట
ఆర్యవైశ్యులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా యువజన సంఘం మాజీ అధ్యక్షులు కొదుమూరి దయాకర్రావు ప్రధాన పార్టీలను డిమాండ్ చేసారు.రాష్ట్ర జనాభాలో 9 శాతం ఉన్న ఆద్యవైశ్యులను రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుగానే వినియోగించుకుంటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.గతంలో అన్ని రాజకీయ పార్టీలు ఆర్యవైశ్యులు కు ప్రాధాన్యత నిచ్చేవని,గత ఎన్నికల సమీకరణలో కాంగ్రెస్ పార్టీ కొందరిని నచ్చజెప్పి పక్కన పెట్టిందని,ఇచ్చిన హమీ మేరకు నామినేటెడ్, ఇతర పదవులను కేటాయించాలని ఆయన సూచించారు.వ్యాపారం వృత్తిగా జీవించే ఆర్యవైశ్యులు కు రాజకీయ అవకాశాలు కల్పించి సామాజిక బాధ్యతతో ప్రజా సేవ లోనూ ప్రోత్సహించాలని కోరారు. సమావేశంలో సంఘం మండల అధ్యక్షులు శీమకుర్తి శ్రీనివాసరావు,జల్లిపల్లి దేవరాజు,కొణిజర్ల ఉమా మహేశ్వరరావు,యశోద సత్యానంద్,శీమకుర్తి జితేంద్ర, తదితరులు పాల్గొన్నారు.
Spread the love