టికెట్ రేసులో ఆసంపల్లి ముందంజ..

నవతెలంగాణ – మంథని
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ అసెంబ్లీ స్థానానికి టికెట్ రేసులో ఆసంపల్లి శ్రీనివాస్ ముందంజలో ఉన్నారు. పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ టికెట్ రేసులో ముందు వరుసలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆసంపల్లి శ్రీనివాస్ పట్ల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధిష్టానం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టాన ప్రకటించిన ఎంపీ అభ్యర్థుల్లో పెద్దపల్లి స్థానం లేకపోవడంతో ఇక్కడ ఆశావాహుల్లో మరింత ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్యే గడ్డం వివేక్ కుమారుడు గడ్డం వంశి,మాజీ ఎంపీ చెలిమల సుగుణ కుమారి పెద్దపల్లి ఎంపీ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న,అధిష్టానం వద్ద వారికి అనుకూలంగా లేనట్లు సమాచారం. మాదిగ సామాజిక వర్గానికి టికెట్ కేటాయిస్తే తప్పకుండా ఆసంపల్లి శ్రీనివాస్ కు దక్కే అవకాశాన అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఆసంపల్లి శ్రీనివాస్ కు రాష్ట్ర మంత్రి తోపాటు అధిష్టానం సంపూర్ణ మద్దతు ఉన్నట్లు కనిపిస్తుంది.పెద్దపల్లి స్థానికుడు,అందరికీ సుపరిచితుడు అయిన ఆసంపల్లి శ్రీనివాస్ కు పెద్దపల్లి టికెట్ కేటాయిస్తే గెలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.ఏది ఏమైనా పెద్దపల్లి పార్లమెంటు బరిలో ఆసంపల్లి శ్రీనివాస్ ముందంజలో దూసుకెళ్తున్నట్లు పలువురు చర్చించుకుంటున్నారు.
Spread the love