Monday, August 31, 2026
E-PAPER
Homeఆటలుఆసియా కప్‌: థాయిలాండ్‌పై భారత్ ఘన విజయం

ఆసియా కప్‌: థాయిలాండ్‌పై భారత్ ఘన విజయం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : మహిళల టీ20 ఆసియా కప్‌లో భారత జట్టు ఘన విజయం సాధించి టోర్నీని ఘనంగా ప్రారంభించింది. థాయ్‌లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా 94 పరుగుల భారీ తేడాతో విజయం నమోదు చేసింది. దుబాయ్‌లో జరిగిన ఈ పోరులో ఓపెనర్ షఫాలీ వర్మ మెరుపు అర్ధశతకంతో సత్తా చాటగా, బౌలర్లు సమష్టిగా రాణించి భారత్‌కు తిరుగులేని విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఓపెనర్ షఫాలీ వర్మ కేవలం 36 బంతుల్లోనే 8 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 64 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది.

ఈ మ్యాచ్‌తోనే టీ20ల్లోకి అరంగేట్రం చేసిన ప్రతీక రావల్ 18 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 22 పరుగులు చేసి రాణించింది. థాయ్‌లాండ్ బౌలర్లలో లావోమి 3 వికెట్లు పడగొట్టగా, సునిద 2 వికెట్లు తీసింది. అనంతరం 160 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన థాయ్‌లాండ్, భారత బౌలర్ల ధాటికి తలవంచింది. ఆ జట్టు 16.1 ఓవర్లలో కేవలం 65 పరుగులకే కుప్పకూలింది. థాయ్‌లాండ్ బ్యాటర్లలో కొంచరోయెంకాయ్ (41) మాత్రమే ఒంటరి పోరాటం చేయగా, మిగతా వారెవరూ కనీస పోరాట పటిమ కనబరచలేకపోయారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -