యువకుడిపై కత్తులతో దాడి

నవతెలంగాణ – పెద్దవంగర
సంక్రాంతి పండుగకు అత్తారింటికి వచ్చిన ఓ యువకుడి పై సోమవారం రాత్రి కత్తులతో దాడి జరిగింది. ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం..వరంగల్ జిల్లా రాయపర్తి మండల పరిధిలోని మైలారం గ్రామానికి చెందిన తుమ్మ దీపక్ రెడ్డికి ఏడేళ్ల క్రితం మండలంలోని కొరిపల్లి గ్రామానికి చెందిన నీరటి నాగమ్మ – చంద్రయ్య కూతురు మహేశ్వరి ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఇద్దరు కుమారులు రిషిత, రిత్విక కలరు. గత కొన్నేళ్లుగా దీపక్ రెడ్డి హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేసుకుంటూ, జీవనం సాగిస్తున్నారు. సంక్రాంతి పండుగ కోసం భార్య పిల్లలతో కలిసి అత్తారింటికి వచ్చారు. తన సోదరి మానస కూడా అదే గ్రామానికి చెందిన డొనాల రత్నాకర్ రెడ్డి కి వివాహం చేశారు. సోమవారం రాత్రి సోదరి ఇంట్లో భోజనం చేసి అత్తారింటికి వెళ్తున్న క్రమంలో అదే గ్రామానికి చెందిన సాకి యాకయ్య,  అతని కుమారులు సాకి సాయికుమార్, సాకి మహేష్, తమ్ముడు సాకి రాములు కలిసి పాత వ్యక్తిగత కక్షలతో కత్తులతో దాడి చేసి, హత్యాయత్నానికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలతో దాడి నుండి తప్పించుకుని అత్తారింటికి సమీపంలో రక్తస్రావంతో పడిపోయిన దీపక్ రెడ్డిని చూసి, వెంటనే కుటుంబీకులు చికిత్స నిమిత్తం హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బాధితుడి భర్య మహేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Spread the love