సన్ షైన్ పాఠశాలలో అవగాహన కార్యక్రమం

– జిల్లా పారామెడికల్ ఆఫీసర్ ఆరిఫ్
నవతెలంగాణ – చండూరు 
స్థానిక సన్ షైన్  స్కూల్  జిల్లా పారామెడికల్ ఆఫీసర్ ఆరిఫ్  విద్యార్థినీ విద్యార్థులకు  శుక్రవారం జాతీయ కుష్ఠు వ్యాధి నిర్మూలన గురించి అవగాహన కల్పించారు. కుష్టువ్యాధి  మైకో బ్యాక్టీరియం లెప్రే  అనే బ్యాక్టీరియ వలన వస్తున్నదని, చర్మానికి, నరాలకు సోకుతుందని, ఈ వ్యాధిని నయం చేయవచ్చనని అన్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ కోడి వెంకన్న  మాట్లాడుతూ.. విద్యార్థులకు ఈ వ్యాధిని యం.డి.టి. విధానంలో పూర్తిగా నయం చేయవచ్చునని తెలిపారు. ఈ సందర్బంగా విద్యార్థులచేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పారామెడికల్ ఆఫీసర్ ఆరిఫ్, పాఠశాల కరెస్పాండెంట్ కోడి వెంకన్న, స్కూల్  డైరెక్టర్ కోడి సుష్మ,  డాక్టర్ మాస రాజు, సిహెచ్ఓ   నర్సింగా రావు, ప్రిన్సిపాల్ రవికాంత్, లతీఫ్ పాషా, ఏఎన్ఎం  ఆశ కార్యకర్తలు, ఉపాధ్యాయని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Spread the love